సోలాపూర్ : మహారాష్ట్ర జిల్లా పరిషద్, పంచాయతీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా పోలింగ్ బూత్ల్లోకి మైనర్లు వెళ్లటం వివాదంగా మారింది. సోలాపూర్, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో తన కుమారుడితో కలిసి ఓ శివసేన ఎమ్మెల్యే నేరుగా పోలింగ్ బూత్లో ఓటు వేసినట్టు వీడియో ఫుటేజ్లో కనిపించింది.