న్యూఢిల్లీ : ఈ నెల 18న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన జల వనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ కానుంది. ఈ భేటీలో గోదావరి – కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చించనున్నారు. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ నేతృత్వంలో సమావేశం జరగనుంది.
ఈ మేరకు భేటీకి హాజరు కావాలని ఆయా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంత జల వనరుల శాఖ కార్యదర్శులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 18న మధ్యాహ్నం 3 గంటలకు జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో భేటీ జరగనుంది.