న్యూఢిల్లీ, మార్చి 29: ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అరవింద్ కే జ్రీవాల్ అరెస్టుతో ఇబ్బందుల్లో ఉ న్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరిన్ని సమస్యలు మొదలయ్యేలా ఉన్నాయి. ఆ పార్టీ కీలక నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ విచారణకు కేంద్ర హోం శాఖ అనుమతించింది. సత్యేందర్ జైన్పై విచారణ కో సం సీబీఐ పంపిన ప్రతిపాదనను ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా పంపించగా శుక్రవా రం అంగీకరించింది. తన నుంచి సత్యేందర్ 2018 నుంచి 2021 మధ్య కాలంలో బలవంతంగా రూ.10 కోట్లు వసూలు చేశారని తీహార్ జైలులో ఉన్న ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ విచారణ ప్రారంభించనుంది. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ను ఈడీ అరెస్టు చేయగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్పై ఈడీ విచారణ కొనసాగుతుండగా ఇప్పుడు సీబీఐని కూడా కేంద్రం రంగంలోకి దింపడంతో ఆప్కి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవ్వాల్సిన వేళ ఆ పార్టీకి ఇది ఇబ్బందికరంగా మారనున్నది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు కేజ్రీవాల్ సతీమ ణి సునీత కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యా ఖ్యానించారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బీహార్ లో రబ్రీదేవిలానే మీరు చెప్తున్న మేడం(సునీత కేజ్రీవాల్) సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించారు. ‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద్’ పేరుతో 8297324624, 9700297002 నం బర్లకు వాట్సాప్ ద్వారా సందేశాలు పం పాలని కోరారు.
ఆప్ లోక్సభ ఎన్నికల వ్యూహం, ఇండి యా కూటమి నేతలతో చర్చలు వంటి కీ లక అంశాలను తెలుసుకునేందుకే ఈడీ కేజ్రీవాల్ ఫోన్ పాస్వర్డ్ అడుగుతున్నదని మంత్రి ఆతిశీ పేర్కొన్నారు.
భారత్ సహా ఎన్నికలు జరుగుతు న్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీ య, పౌర హక్కులకు రక్షణ ఉం టుందని, ప్రతి ఒక్కరు స్వేచ్ఛా, పారదర్శక వాతావరణంలో ఓ టు వేస్తారని ఆశిస్తున్నామని ఐ క్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజర్రిక్ పేర్కొన్నారు. భారత్లో లోక్సభ ఎన్నికల ముంగిట ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు, కాం గ్రెస్ పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ చేయడంపై ఈ విధంగా స్పందించారు.
కేజ్రీవాల్ అరెస్టు అంశంపై ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలను అమెరికా పునరుద్ఘాటించింది. న్యాయమైన, పారదర్శక, సమయానుకూలమైన చట్టప్రక్రియలు జరగాలని మాత్రమే తాము ప్రోత్సహించామని, దీనిని ఎవరూ వ్యతిరేకిస్తారని అనుకోవడం లేదని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించినందుకు భారత్లోని అమెరికా దౌత్యవేత్తకు భారత విదేశాంగ శాఖ సమన్లు ఇచ్చి, అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.