హైదరాబాద్ : కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో మంత్రి నిరంజన్రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశం కానున్నది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించనున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందం రెండు రోజులుగా నిరీక్షిస్తున్నది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు పార్లమెంట్లో సోమవారం మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. కలిసేందుకు మంత్రులు, ఎంపీల బృందం నిరీక్షిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు కలిసేందుకు మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారని ఎంపీలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎంతైనా ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రమంత్రులు చెబుతున్నప్పటికీ.. దీనిపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని మంత్రిని కోరనున్నారు.