చెన్నై: ఇటీవల మనీ లాండరింగ్ కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసిన తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీకి బుధవారం కరోనరీ బైపాస్ సర్జరీ జరిగింది. ‘ఆయన హార్ట్ రేట్, బీపీ స్థిరంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం.
ఆయన ప్రస్తుతం పోస్ట్ ఆపరేటివ్ కార్డియోథొరాసిస్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు’ అని ఆపరేషన్ నిర్వహించిన కావేరి దవాఖాన ఒక ప్రకటనలో తెలిపింది. సెంథిల్ బాలాజీని ప్రైవేట్ దవాఖానకు తరలించడాన్ని ఈడీ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, అందుకు అనుమతి ఇచ్చిన మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.