Arunachal Pradesh : ఇటీవలే దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్ యువకుడు మిరామ్ టారోర్ను చైనా భారత సైన్యానికి అప్పగించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలే సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్ యువకుడ్ని చైనా సైన్యం భారత సైన్యానికి అప్పగించింది. దీనికి సంబంధించిన అన్ని నియమాలను పాటించారు. మెడికల్కు సంబంధించిన పరీక్షలను కూడా పూర్తి చేశారు అంటూ కిరణ్ రిజిజు తెలిపారు.
మిరామ్ టారోర్ అనే యువకుడు అరుణాచల్ ప్రదేశ్ వాసి.ఈ నెల 18న ఆయన్ను చైనా సైన్యం అపహరించిందని ఎంపీ ఆరోపించారు. సరిహద్దు గ్రామాల దగ్గర ఈ యువకుడు ఇతర స్నేహితులతో కలిసి వేటకు వెళ్లాడు. ఈ సమయంలోనే చైనా సైన్యం అపహరించిందని వార్తలొచ్చాయి. వెంటనే భారత సైన్యం అప్రమత్తమైంది. చైనా ఆర్మీతో మాట్లాడింది. అయితే ఆ యువకుడు తమ వద్ద లేడని చైనా సైన్యం మొదట్లో బుకాయించింది. ఆ తర్వాత ఆ యువకుడు తమ వద్దే ఉన్నాడని, తిరిగి అప్పగించేందుకు తగిన ప్రక్రియను పూర్తి చేస్తున్నామని పేర్కొంది.