హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన ఐసోలేషన్లో వెళ్లారు. గత మూడు రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి కోలుకునే వరకు ప్రజలెవరూ తనను కలిసేందుకు రావొద్దని కోరారు. నియోజకవర్గ ప్రజలకు అధికారులు, పీఏలు అందుబాటులో ఉంటారన్నారు.
ఇవాళ కొంచెం ఒంట్లో నలతగా ఉండడంతో సాయంత్రం మంత్రి పరీక్ష చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో మంత్రి వెంటనే ఐసోలేషన్కి వెళ్లారు. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాతపూర్వక హామీ కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందంలో దయాకర్రావు సైతం ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన నాలుగు, ఐదురోజులు ఢిల్లీలో పడిగాపులు కాశారు. ఈ క్రమంలోనే కరోనా సోకి ఉండొచ్చని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేసుకోవడంతో పాటు హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు.