Minister Dayakar Rao | కొత్త పే స్కేల్ జీవో జారీ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు నింపుతున్నది. ఈ సందర్భంగా సిబ్బంది మంత్రులు, అధికారులను కలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. హైదరాబాద్లోని మంత్రుల కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఉద్యోగులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లితో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ కొత్త పే స్కేల్ ఇవ్వడం సీఎం కేసీఆర్ ఉదారతకు నదర్శనమన్నారు. హేతుబద్ధంగా పని చేయడం సీఎం కేసీఆర్ నైజమన్నారు. ఓపికతో ఉన్న వారికి తప్పకుండా కేసీఆర్ న్యాయం చేస్తారనడానికి సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలే నిదర్శనమన్నారు. 25 ఏండ్లుగా ఎదురు చూస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ఏ ప్రభుత్వం లేనివిధంగా వేతనాలు పెంచారన్నారు. ఆ తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును సెర్ప్ ఉద్యోగులు ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం నేతలు సుదర్శన్, వెంకట్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.