తమిళనాడు : అన్నా డీఎంకే (AIADMK) రెబెల్ ఎమ్మెల్యేలను టీవీకేలో చేర్చుకోమని, అలాగే వారికి కేబినెట్లో చోటు కల్పించమని క్రీడాభివృద్ధి శాఖ మంత్రి అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీవీ షణ్ముగం నేతృత్వంలోని 25 మంది అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్ (విశ్వాస పరీక్ష) సమయంలో మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీసీకే, వామపక్ష పార్టీల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీవీకే పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.
మంత్రి పదవుల కోసం కాకుండా, తమ పార్టీని కాపాడుకునే లక్ష్యంతోనే షణ్ముగం నేతృత్వంలోని ఏఐడీఎంకే తిరుగుబాటు వర్గం సభా విశ్వాస పరీక్ష (floor test) సమయంలోటీవీకేకు మద్దతు తెలిపిందని అర్జున తెలిపారు. అంతే తప్పా మంత్రి వర్గంలోకి తీసుకోబోమని ఆయన ఆయన తెలిపారు. సీఎం విజయ్ వామపక్ష పార్టీలను కూడా తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని అర్జున పరోక్షంగా తెలిపారు.