రాయ్పూర్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. జిల్లాలో శుక్రవారం సాయంత్రం భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మావోయిస్టు చనిపోయాడు. అతడిని మిలీషియా కమాండర్ మాద్వి భీమాగా గుర్తించారు. ఘటనా స్థలంలో రైఫిల్, 5 కిలోల ఐఈడీ, 20 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 2 బీజీఎల్ షెల్ స్వాధీనం చేసుకున్నామని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.