న్యూఢిల్లీ, ఆగస్టు 26: మైక్రో బ్లాగింగ్ వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) తన ప్రీమియం వినియోగదారులకు అదనపు ఫీచర్లను కల్పించింది. ఇక నుంచి వారు భారీ వీడియోలు పోస్టు చేయవచ్చునని శుక్రవారం ప్రకటించింది. 1080 పిక్సెల్ క్వాలిటీతో ఉన్న రెండు గంటల వీడియోలు, 720 పిక్సెల్ క్వాలిటీవైతే మూడు గంటల నిడివిగల వీడియోలు పోస్ట్ చేయవచ్చు.
మీడియా స్టూడియో, స్టూడియో.ఎక్స్.కామ్లు ప్రీమియం సబ్స్ర్కైబర్లందరికీ అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే తమ టైమ్లైన్ నుంచి కెమెరా రోల్కు వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడమే కాక, తాము పోస్టు చేసే వీడియోల డౌన్లోడ్కు అనుమతి/నిరాకరణ ఆప్షన్ను కూడా తామే ఎంచుకోవచ్చు. అలాగే ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ ఇన్ను తీసుకునే ప్రణాళికను ఎక్స్ వెల్లడించింది.