న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్ నిధుల నుంచి లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమీకరిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మెడికల్ ఆక్సిజన్ సరఫరాలు పెంచేందుకు అదనపు కేటాయింపులు జరిపామని వెల్లడించింది.
5805 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటున్నామని, 1407 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తో కూడిన 81 కంటెయినర్లు భారత వాయు సేన ద్వారా దిగుమతయ్యాని తెలిపింది. 637 మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను వివిధ రాష్ట్రాలకు తరలించేందుకు 157 ఆక్సిజన్ ప్రత్యేక రైళ్లను నడిపామని వెల్లడించింది.