జైపూర్ : కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం పెంచుకునేందుకు రాజస్థాన్లోని జైపూర్ మెట్రో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నది. ఇప్పటికే చిన్నపాటి ప్రకటనల చిత్రీకరణకు కోచ్లను అద్దెకు ఇస్తున్న మెట్రో తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. బర్డ్ డే వేడుకలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు గంటల చొప్పున కోచ్లను అద్దెకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
కోచ్లను అద్దెకు తీసుకోవాలనుకునే వారు గంటకు రూ. 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. సమయం మించితే ప్రతి గంటకు అదనంగా రూ. వెయ్యి చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఓ ఇవెంట్ మేనేజ్మెంట్ సంస్థతో జైపూర్ మెట్రో ఒప్పందం కుదుర్చుకుంది. మెట్రో స్టేషన్లో బ్యానర్లు, సాండ్లు, పందిళ్లు ఏర్పాటు చేసుకొని చిన్నపాటి ప్రకటనలు సైతం ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించింది.