హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు.
శనివారం వాయుగుండం బంగ్లాదేశ్లోని ఖేపుపారమొంగ్లా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మరో 48 గంటలపాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో మబ్బులతో కూడిన వాతావరణం, జల్లులు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఉత్తర తెలంగాణను చలి వణికిస్తున్నది.