WhatsApp | న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఈ ఏడాది ఆగస్టు నెలలో భారత్లో 74 లక్షల వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్టు ‘మెటా’ వెల్లడించింది. ఐటీ నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్టు తాజా నివేదికలో సంస్థ పేర్కొన్నది. అసభ్య, అభ్యంతరకర సందేశాలు, వీడియోలు పంపేందుకు ‘వాట్సాప్’ను వాడుతున్నారని, దీనిని అడ్డుకునేందుకు ఖాతాలపై బ్యాన్ విధిస్తున్నట్టు మెటా సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రతి ఒక్క ఖాతాదారుడి ‘యూజర్ సేఫ్టీ రిపోర్ట్’లో ఫిర్యాదులకు సంబంధించిన వివరాలుంటాయని, దీని ఆధారంగా చర్యలు చేపట్టినట్టు సంస్థ తెలిపింది. దీంతోపాటు వాట్సాప్ వేదికపై అభ్యంతరకర చర్యల్ని అడ్డుకునేందుకు సంస్థ తనంతట తానుగా 35 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్టు వివరించింది.