శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో పౌరుల మూకుమ్మడి నిర్బంధానికి వ్యతిరేకంగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. శ్రీనగర్లో ఇటీవల ఓ కశ్మీరీ పండిట్, సిక్కు మహిళ మరణించిన నేపధ్యంలో భద్రతా దళాలు 500 మందికి పైగా కశ్మీరీలను నిర్బంధంలోకి తీసుకోవడాన్ని మెహబూబా ముఫ్తీ ఖండించారు.
కశ్మీర్ ప్రజలను స్ధానిక యంత్రాంగం వేధింపులకు గురిచేస్తోందని, అణిచివేతను మొదలుపెట్టిన అధికార యంత్రాంగం కశ్మీరీలను పెద్దసంఖ్యలో నిర్బంధిస్తోందని దుయ్యబట్టారు. కశ్మీరీలు ఎటువంటి నేరానికి పాల్పడినా ఆధారాలు లేకున్నా వారిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధించింన కశ్మీర్ ప్రజల వివరాలతో పాటు వారు చేసిన నేరాలేంటో వెల్లడించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.