శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అనంత్నాగ్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. కశ్మీర్ లోయలోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. పీడీపీ యువజన విభాగం అధ్యక్షుడు వహీద్ పర్రా శ్రీనగర్ సీటు నుంచి, రాజ్యసభ మాజీ సభ్యుడు మీర్ ఫయాజ్ బారాముల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు చీఫ్ సర్తాజ్ మద్నీ కలిసి మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని రెండు స్థానాలైన ఉదంపూర్, జమ్మూలో కాంగ్రెస్ పార్టీకి పీడీపీ మద్దతు ఇస్తుందని అన్నారు.
కాగా, ‘ఇండియా’ బ్లాక్ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఇటీవల ప్రకటించారు. శ్రీనగర్ లోయలో పోటీ చేయనున్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)పై ఆమెతోపాటు మరో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ముఫ్తీ నిర్ణయంపై ఎన్సీకి చెందిన ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇండియా’ కూటమితో సీట్ల ఒప్పందంలో భాగంగా జమ్ములోని రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీకి వదిలేసినట్లు ఆయన చెప్పారు.