జమ్మూ కశ్మీర్ డీలిమిటేషన్ కమిటీ నివేదికపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ నివేదికను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఇదేమి పునర్విభజన? అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ నివేదికను తాము ఏమాత్రం నమ్మమని ఆమె పేర్కొన్నారు.
డీలిమిటేషన్పై వేసిన కమిటీ బీజేపీకి కొనసాగింపేనని మెహబూబా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు అనుసరణే ఈ ముసాయిదా అని ఆమె తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ కమిషన్పై తమకు అసలు నమ్మకమే లేదన్నారు.
మీరు ఏ డీలిమిటేషన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నారు? బీజేపీకి కొనసాగింపుగా వుండే కమిటీ గురించా? వారికి తోచిన విధంగా, వారి సొంత నిర్ణయాలు అందులో పొందుపరిచారు. వాటిని మేం నమ్మం. అని మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు.