కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కే సింగ్
న్యూఢిల్లీ, మే 13: డిమాండ్కు తగ్గ విద్యుత్తు సరఫరా చేయడం సవాలుగా మారిందని కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. భారతదేశం ప్రస్తుతం అతిపెద్ద విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని చెప్పారు.
విద్యుత్తుకు డిమాండ్ ఇప్పట్లో తగ్గే సూచనలు లేవని పేర్కొన్నారు. అక్టోబర్ నెల దాకా కరెంటుకు కొరత ఉండవచ్చని తెలిపారు. విద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు దిగుమతి చేసుకొన్న బొగ్గుతో నడిచే ప్లాంట్లను తిరిగి ప్రారంభిస్తున్నామని, 4 గిగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లలో మూడు రోజుల్లో కరెంటు ఉత్పత్తి ప్రారంభం అవుతుందని చెప్పారు.