తిరువనంతపురం: రాష్ట్రంలో మెడికల్ ఆఫీసర్లు, ఆరోగ్య కార్యకర్తలు మీడియాతో (Media) మాట్లాడాలంటే కేరళ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేసింది. బహిరంగంగా మీడియాతో మాట్లాడాలంటే సంబంధిత ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరుకు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ వీకే రాజు ఆదేశాలు జారీచేశారు.
ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించాల్సిన అవసరం వస్తే వారు వాస్తవాలను ధృవీకరించుకోవాలని, సంబంధిత శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సమాచారం సరిగాలేనట్లయితే అది ప్రజలను తప్పుదోవ పట్టించేలా, వ్యాధి వ్యాప్తిపై కలకలం సృష్టించినదవుతుందని సూచించారు.