Medha Patkar : నర్మదా బచావో ఆందోళన్ (NBA) ఉద్యమకారిణి మేధా పాట్కర్ను ఢిల్లీలోని సాకేత్ కోర్టు పరువు నష్టం కేసులో దోషిగా తేల్చింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) చైర్మన్ వీకే సక్సేనా మేధా పాట్కర్పై పరువు నష్టం దావా వేశారు. పాట్కర్, సక్సేనా మధ్య 2000 సంవత్సరం నుంచి చట్టసంబంధ పోరాటం కొనసాగుతూ వస్తున్నది.
నర్మదా బచావో ఆందోళన్కు వ్యతిరేకంగా, తనకు వ్యతిరేకంగా వీకే సక్సేనా ప్రచార ప్రకటనలు ఇచ్చారని 2000 సంవత్సరంలో మేధాపాట్కర్ దావా వేయడంతో వారి మధ్య వివాదం మొదలైంది. సక్సేనా అప్పుడు అహ్మదాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు అధిపతిగా ఉన్నారు.
మేధాపాట్కర్ దావా నేపథ్యంలో వీకే సక్సేనా ఆమెపై రెండు దావాలు వేశారు. మేధా పాట్కర్ తన గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఒక దావా, టీవీ ఛానెల్లో తన పరువుకు నష్టం కలిగించే ప్రకటన ఇచ్చారని మరో దావా వేశారు. ఈ నేపథ్యంలో పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ను ఢిల్లీలోని సాకేత్ కోర్టు దోషిగా ప్రకటించింది.