ఈరోడ్, మార్చి 28: పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ రాలేదని ఇటీవల ఆత్మహత్యా యత్నం చేసిన ఈరోడ్ ఎంపీ గణేశ్మూర్తి గురువారం కోయంబత్తూరు దవాఖానలో మరణించారు. ఆయన మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సంతపం తెలిపారు.
గణేశ్మూర్తి మృతిపట్ల వైకో కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తి కొడుకు, కూతురును పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు. ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో అతనికి టికెట్ కేటాయించకపోవటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని చెప్పటంలో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు.