సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్కు బీఎస్పీ అధినేత్రి మాయావతి కౌంటర్ ఇచ్చారు. తనకు తిరిగి యూపీ సీఎం అవ్వాలని ఉందని, దాని తర్వాత దేశ ప్రధాని కావాలన్నదే తనకు ఉందని స్పష్టం చేశారు. అంతేకానీ రాష్ట్రపతి కావాలన్న కాంక్ష తనకు ఏమాత్రమూ లేదని తేల్చి చెప్పారు. యూపీ ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లను మాయావతి బీజేపీకి ఇచ్చేసిందని, ఇప్పుడు ఆమె రాష్ట్రపతి అవుతుందేమో అంటూ అఖిలేశ్ దెప్పి పొడిచారు. ఈ నేపథ్యంలోనే మాయావతి పై వ్యాఖ్యలు చేశారు.
సమాజ్వాదీ పార్టీ తమపై రోజూ ఏదో పుకార్లు పుట్టిస్తూనే వుంటుందోంటూ మాయావతి విరుచుకుపడ్డారు. అయితే.. దళితులు, అణగారిన వర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే, సీఎం, ప్రధాని అవడం బాగా సులభమవుతుందని మాయావతి పేర్కొన్నారు.
మళ్లీ యూపీ సీఎం అవ్వాలనే అనుకుంటున్నాను. దేశ ప్రధాని కావాలని కూడా కలలు కంటున్నాను. రాష్ట్రపతి కావాలన్న కాంక్ష లేనే లేదు. నేను సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం లేదు. అంబేద్కర్, కాన్షీరాం నడిచిన బాటలోనే నడవాలని అనుకుంటున్నాను. వారికి ఈ విషయం అర్థం కావాలి. అని మాయావతి పేర్కొన్నారు.