లక్నో: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీచేస్తామని, ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్కు చెందిన, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆమె కొట్టిపరేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని, బీఎస్పీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. ఈమేరకు ఆమె ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు.
కాగా, పంజాబ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ శిరోమణి అకాలీదళ్ పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 117 సీట్లలో అకాలీదళ్ 97 స్థానాల్లో, బీఎస్పీ 20 స్థానాల్లో పోటీచేస్తున్నాయి.