న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్దీప్ ధన్ఖర్కు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్వీట్ చేశారు. అధికార, విపక్షాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 6న ఉప రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ జరుగనున్నది. ఈ పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగ్దీప్ ధన్ఖర్కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాయావతి మద్దతు ప్రకటనపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ.. బెహెన్ జీ ఎల్లప్పుడు అణగారిన వర్గాలకు సంబంధించిన గళాన్ని లేవనెత్తారని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.