లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి (Mayawati) ఆదివారం కీలక ప్రకటన చేశారు. మేనల్లుడు ఆకాష్ ఆనంద్ తన రాజకీయ వారసుడని వెల్లడించారు. 2024 లోక్సభ ఎన్నికలకు పార్టీ సన్నాహాల కోసం లక్నోలో ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 28 ఏళ్ల మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను తన రాజకీయ వారసుడిగా నియమించారు. బీఎస్పీని బలోపేతం చేసే బాధ్యత కూడా ఆకాష్కు అప్పగించారు.
కాగా, మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కుమారుడే ఆకాష్ ఆనంద్. గత ఏడాది నుంచి బీఎస్పీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నారు. 2019లో సోదరుడు ఆనంద్ కుమార్ను పార్టీ ఉపాధ్యక్షుడిగా, మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను జాతీయ కోఆర్డినేటర్గా మాయావతి నియమించారు. అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో పార్టీకి మాయావతి అధ్యక్షత వహిస్తారని బీఎస్పీ నేత ఉదయ్వీర్ సింగ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ కేడర్కు ఆకాష్ ఆనంద్ నాయకత్వం వహిస్తారని చెప్పారు.
10-12-2023-BSP Press Release-All-India Party Meeting pic.twitter.com/EzBT2XhFeC
— Mayawati (@Mayawati) December 10, 2023