UP Polls | యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఘోర స్థాయికి పడిపోయిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా విమర్శించారు. బీజేపీ వోట్లను చీల్చడానికే కాంగ్రెస్ రంగంలోకి దిగిందని, కాంగ్రెస్కు ఓటు వేసి, వృథా చేసుకోవద్దని యూపీ ప్రజలకు పిలుపునిచ్చారు. కొన్ని గంటల్లోనే యూపీ సీఎం అభ్యర్థిని మార్చేశారని, యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఘోర స్థాయికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమీ బాగోలేదు. సీఎం అభ్యర్థి విషయంలో కొద్ది గంటల్లోనే మాట మార్చేశారు. కాంగ్రెస్కు ఓటు వేసి ప్రజలు తమ వోటును వృథా చేసుకోవద్దు. గంపగుత్తగా బీఎస్పీకి ఓటు వేయండి అని మాయావతి పిలుపునిచ్చారు. ఓట్లను చీల్చే పార్టీగానే కాంగ్రెస్ను ప్రజలు చూస్తున్నారని మాయావతి ఎద్దేవా చేశారు.
ఇంకెవరు? నేనే సీఎం అభ్యర్థి అన్న ప్రియాంక
యూపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా విలేకరులు యూపీ సీఎం అభ్యర్థి గురించి అడిగారు. దీంతో అంతటా నేనే కనిపిస్తున్నా. ఇంకెవరైనా ఉన్నారా? నన్నే సీఎం అభ్యర్థిగా ఎందుకు అనుకోరు? అంటూ ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే మాట మార్చేశారు. అదే ప్రశ్నను కొందరు పదే పదే అడగడంతోనే, చిరాకుతోనే అలా చెప్పానని ప్రకటించారు. యూపీ సీఎం అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని, ఇంకా అధిష్ఠానం నిర్ణయించలేదని ప్రియాంక పేర్కొన్నారు.