వారణాసి జ్ఞాన్వాపీ మసీదు సర్వే వివాదం కొనసాగుతుండగా, మథురలో అలాంటిదే మరో పిటిషన్ దాఖలైంది. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాం తానికి ఆనుకొని ఉండే షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణకు మథుర కోర్టు అంగీకరించింది.
మనీష్ యాదవ్, మహేంద్ర ప్రతాప్ సింగ్, దినేశ్ శర్మ పిటిషన్ వేశారు. షాహీ ఈద్గా ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించేందుకు అడ్వకేట్ కమిషనర్ను నియమించాలని కోరారు. 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కృష్ణుడి ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చి ఈ మసీదు నిర్మించారని పేర్కొన్నారు.