కర్ణాటక రాజధాని బెంగళూరు వర్షాలతో అల్లాడిపోతున్నది. ఐటీ సిటీగా పేరొందిన బెంగళూరు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో సోమవారం ఎలక్ట్రానిక్ సిటీని కలిపే ప్రధాన జంక్షన్లలో ఒకటైన మారతహళ్లి-సిల్క్ బోర్డు రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బెంగళూరువాసులు, ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లేవారు నాలుగు గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకున్నారు.
ఐటీ నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో వందలాది మంది వాహనదారులు, డ్రైవర్లు కార్యాలయాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్మార్ట్సిటీ ప్రాజెక్టు కింద నిర్మించిన రిచ్మండ్ రోడ్డుపై నీరు నిల్వడంతో ప్రజలు.. అధికారులు, నాయకులపై మండిపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఇదిలా ఉండగా, బెంగళూరు రూరల్, చిక్కబళ్లాపూర్, చిక్కమగళూరు, చిత్రదుర్గ, దావణగెరె, హాసన్, కోలార్, రాంనగర్, కొడగు, చామరాజనగర్, మాండ్య, మైసూరు, శివమొగ్గ, తుమకూరులాంటి 14 జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
#WATCH | Karnataka: Massive traffic jam on Marathahalli-Silk Board junction road in Bengaluru amid severe waterlogging caused due to heavy rainfall pic.twitter.com/KUnF0cuPtR
— ANI (@ANI) September 5, 2022