లక్నో: ఉత్తరప్రదేశ్లోని మథుర భారీ అగ్నిప్రమాదం జరిగింది. మథురలోని మూడంతస్థుల బట్టల షోరూమ్లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వస్త్రాల షోరూమ్ కావడంతో మంటలు వేగంగా బిల్డింగ్ మొత్తాని వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. మొదటి అంతస్థులో మంటలు అంటుకున్నాయని, అవి క్రమంగా రెండు, మూడో అంతస్థుకు వ్యాపించాయని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరుగలేదన్నారు.
Uttar Pradesh | Massive fire broke out at a clothing showroom in Mathura, is under control now
"The three floors of the building caught fire. 6-7 fire tenders are present on spot. Fire is under control now, we didn't let the fire spread to adjacent buildings," says Fire Officer pic.twitter.com/ZYZki4K6H2
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 1, 2023
కాగా, మూడంతస్థుల బిల్డింగ్ పూర్తిగా కాలిపోయిందని షోరూమ్ సమీపంలో ఉన్న హోటల్ యజమాని శ్యామ్ సింఘాల్ చెప్పారు. షోరూమ్లోని సరుకంతా అగ్నికి ఆహుతయిందని వెల్లడించారు. కోట్లలో నష్టం వాటిళ్లిందని వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జార్ఖండ్లో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ధన్బాద్ పట్టణంలోని ఓ బహుళ అంతస్థుల అపార్ట్మెంట్లో భారీఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 13 అంతస్థులు ఉన్న ఈ భవనంలో ప్రమాద సమయంలో దాదాపు 400 మంది ఉన్నట్టు సమాచారం.
Jharkhand | Police personnel deployed outside Dhanbad's Ashirwad Tower Apartment where a massive fire broke out yesterday due to which 14 people lost their lives & 12 were injured. Visuals from the site of the incident pic.twitter.com/wIv4lgwMKD
— ANI (@ANI) January 31, 2023