ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Fire Accident)లో గాయపడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గోరేగావ్లోని ఏడంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
భవనం నుంచి మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిసంఖ్య 50 దాటింది. ఘటనా స్ధలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాద ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఇక అగ్నిప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని అధికారులు తెలిపారు.
Read More :
Ms Dhoni | జియోమార్ట్కు బ్రాండ్ అంబాసిడర్గా ధోనీ