బెంగళూరు: ఒక పబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పబ్ యజమానితో సహా ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. (Mysuru Pub Fire) కర్ణాటకలోని మైసూర్లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఒక రెస్టో పబ్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.
కాగా, పబ్లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. డార్జిలింగ్కు చెందిన 26 ఏళ్ల సాహిన్, నేపాల్కు చెందిన 24 ఏళ్ల ప్రకాష్గా మృతులను గుర్తించారు. పబ్ యజమాని ప్రీతమ్ పుమీత్తో పాటు కస్టమర్లైన సోను, రమేష్, మహాదేవ్ ప్రసాద్, ప్రజ్వల్, అవినాష్కు కాలిన గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పబ్లో అగ్నిప్రమాదానికి దారి తీసిన కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.