నేపిడా: మయన్మార్లో ఆదివారం భారీ పేలుడు చోటుచేసుకుంది. మైనింగ్ పేలుడు పదార్థాలు ఉంచిన భవనంలో జరిగిన ఈ పేలుడులో 45 మంది మృతిచెందగా, 70 మందికిపైగా గాయపడ్డారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చైనా సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలోని నామ్ఖమ్ టౌన్షిప్లోని కౌంగ్టప్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ ప్రాంతం మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ‘టాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (టీఎన్ఎల్ఏ) నియంత్రణలో ఉంది. సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ ఆదివారం నాటికి ఆరుగురు చిన్నారులతో సహా 45 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.