బెంగళూరు, ఆగస్టు 11: ఏదైనా యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయిన వివాహిత కూతుర్లు కూడా బీమా పరిహారానికి అర్హులేనని ఇన్సూరెన్స్ కంపెనీలకు కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ‘పెండ్లయిన కుమారులైనా.. కూతుర్లు అయినా కూడా ఎలాంటి వివక్ష ఉండకూడదు.
చనిపోయిన తల్లిదండ్రుల వివాహిత కూతుర్లకు నష్టపరిహారం ఇవ్వడం కుదరదంటే అంగీకరించేది లేదు’ అని స్పష్టం చేసింది. రేణుక అనే 57 ఏండ్ల మహిళ ఓ యాక్సిడెంట్లో మరణించారు. నష్టపరిహారం కింద ఆమె భర్త, ముగ్గురు కూతుర్లు, కుమారుడికి పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని కోర్టు ఆదేశించింది.