ముంబై, డిసెంబర్ 17: ఈ నెల 24వ తేదీలోగా మరాఠా రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమ నేత జరాంగే పాటిల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గంట కూడా అదనపు సమయం ఇవ్వబోమని స్పష్టంచేశారు. మరాఠా రిజర్వేషన్ల డిమాండ్కు నాయకత్వం వహిస్తున్న బృందంతో జాల్నా జిల్లా అంతర్వాలి సారథి గ్రామంలో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లు ప్రభుత్వం ఏమి చేసిందని, ఇంకా ఎందుకు సమయం ఇవ్వాలని ప్రశ్నించారు. తక్షణమే మరాఠా ప్రజలకు రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు.