ముంబై, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్ జరాంగే మళ్లీ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. రిజర్వేషన్ల అమలు కోసం కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో జరాంగే ఇటీవల 40 రోజుల సమయం ఇచ్చారు. గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయకపోవడంతో బుధవారం మళ్లీ జాల్నా జిల్లాలోని తన స్వగ్రామంలో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చొన్నారు. జరాంగే మళ్లీ దీక్ష చేపట్టడంతో సీఎం ఏక్నాథ్షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.