తిరుచ్చి, జనవరి 2: తమిళనాడులోని తంజావూరులో రూ.500 కోట్ల విలువైన మరకత లింగాన్ని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నేండ్లు దీనిని బ్యాంకు లాకర్లో పెట్టిన వ్యక్తులు, ఇటీవల దానిని బయటకు తీసుకొచ్చి అరులానందనగర్లోని ఓ ఇంట్లో దాచిన సమాచారం సీఐడీ విగ్రహాల విభాగానికి అందడంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. మరకత లింగం 530 గ్రాముల బరువు, ఎనిమిది సెంటీమీటర్ల పొడవు ఉన్నదని సీఐడీ అధికారులు తెలిపారు. నిపుణులతో పరిశీలన జరిపించగా మరకత లింగం ఒరిజనల్ అని నిర్ధారణ అయిందని, శాస్త్రీయ విశ్లేషణ చేయడంతోపాటు అది ఏ దేవాలయానికి చెందినదో తేల్చాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కుంభకోణం కోర్టుకు లింగాన్ని శనివారం చూపించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు