రాంచీ: జార్ఖండ్లోని గిరిడి జిల్లాలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి 2 – 2.30 గంటల సమయంలో గిరిడి జిల్లాలోని డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జిని పేల్చేశారు. అంతటితోప ఆగని నక్సల్స్.. ఒక మొబైల్ ఫోన్ టవర్ను పేల్చేసి, మరో టవర్కు నిప్పుపెట్టారు.
అగ్రనేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా మావోయిస్టులు జనవరి 27 వరకు ‘రెసిస్టెన్స్ వీక్ గా పాటిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజే వరుస విధ్వంసాలకు దిగారు. మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు మావోయిస్టులు తొలుత ఖుఖ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎయిర్టెల్ టవర్కు నిప్పుపెట్టారని, తెల్లాజామున ఒంటిగంట ప్రాంతంలో జైనుల యాత్రాస్థలమైన మధుబన్లో ఐడియా టవర్ను పేల్చేశారని పోలీసులు తెలిపారు.
అనంతరం డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జిని పేల్చేశారు వెల్లడించారు. ఈ ఘటనల అనంతరం మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ మరింత ముమ్మరం చేసినట్టు డుమ్రి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ తెలిపారు.