రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ (Dantewada) జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోయాడు. మంగళవారం సాయంత్రం దంతేవాడ జిల్లాలోని తుమాక్పాల్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG) గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. అతడిని మావోయిస్టు దర్భా డివిజన్లో ప్లాటూన్ కమాండర్ లఖ్మా కవాసీగా గుర్తించామని చెప్పారు. అతనిపై రూ.3 లక్షల రివార్డు ఉందన్నారు. అతని నుంచి తుపాకీ, ఐదు కిలోల మందుపాతర (ఐఈడీ), ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.