దంతేవాడ: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. జిల్లాలోని దర్భ డివిజన్ మలంగేర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ (CRPF) క్యాంప్పై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగారు. సీఆర్పీఎఫ్ జవాన్లు, మావోయిస్టుల మధ్య గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయని ఏఎస్పీ రాజేంద్ర జైస్వాల్ తెలిపారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పారు. మలంగేర్లో ఈ మధ్యే సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేశారు. దానిపైనే మావోయిస్టులు దాడిచేయడం గమనార్హం.
ఈ నెల 21న ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని నువాపాడా వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. నక్సల్స్ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.