ఔరంగాబాద్: మరాఠా సామాజికవర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జరాంగే పాటిల్ చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారంతో 11వ రోజుకు చేరుకొన్నది. ఈ సందర్భంగా శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల సాధనకు రాళ్లు విసిరే అవసరం లేదని, చట్ట ప్రకారమే ఆందోళనలు చేసి రిజర్వేషన్లు సాధిస్తామని స్పష్టం చేశారు. ఓబీసీ రిజర్వేషన్ల కింద లబ్ధి పొందేందుకు మరాఠ్వాడా రీజియన్లోని మరాఠాలకు కుంబీ కుల ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో జీనాలజీ(వంశపారపర్యం) క్లాజ్ను ప్రభుత్వ తీర్మానం(జీఆర్) నుంచి తొలగించాలని మహారాష్ట్ర సర్కార్ను డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొన్న ఆయన.. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని ఆందోళనకారులకు సూచించారు. మరాఠ్వాడా ప్రాంతం ఒకప్పుడు నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ నేపథ్యంలో మరాఠ్వాడా రీజియన్కు చెందిన మరాఠా కమ్యూనిటీ సభ్యులు నిజాం కాలం నాటి వంశపారంపర్య రికార్డులను అందించిన తర్వాత కుంబీ కుల సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ తీర్మానం జారీచేసింది.