Manish Sisodia | లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి (former Deputy Chief Minister ), ఆప్ (AAP) సీనియర్ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు చుక్కెదురైంది. సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు సిసోడియా బెయిల్ పిటిషన్ (Bail Petition)ను ధర్మాసనం కొట్టివేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Liquor Policy Case) లో సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీహార్ జైలు (tihar jail)లో ఉన్న ఆయన్ని ఈడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ (Bail Petition) దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు (Delhi Court) బెయిల్ను రిజెక్ట్ చేస్తూ తీర్పునిచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో మార్చి9న మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు, మద్యం తయారీ కంపెనీలు, వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయాలు, ముడుపుల వ్యవహారంపై సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం సిసోడియా తిహార్ జైలు (tihar jail)లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మద్యం కుంభకోణంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Also Read..
Parineeti Chopra | త్వరలో ఆప్ ఎంపీతో హీరోయిన్ వివాహం.. కన్ఫమ్ చేసిన సింగర్
Dutch Tourist | గోవాలో విదేశీ పర్యాటకురాలిపై కత్తితో దాడి
Navjot Singh Sidhu: రేపే జైలు నుంచి నవజ్యోత్ సింగ్ సిద్దూ రిలీజ్