న్యూఢిల్లీ : తన పీఏను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. పీఏ ఇంటిపై శనివారం ఈడీ దాడులు చేసిందని, అయితే అక్కడ ఏమీ అధికారులకు ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. ఇప్పటికీ నా పీఏని అరెస్ట్ చేశారు. మరోవైపు ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పీఏను అదుపులోకి తీసుకుని వాంగ్మూలాలు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది.
ఈ క్రమంలో సిసోడియా స్పందిస్తూ.. ‘వారు (ఈడీ) నా ఇంటిపై తప్పుడు ఎఫ్ఐఆర్ ద్వారా దాడి చేశారు. బ్యాంక్ లాకర్లు తనిఖీ చేశారు. మా గ్రామంలో దర్యాప్తు చేశారు. కానీ, నాకు వ్యతిరేకంగా ఏమీ గుర్తించలేదు. ఈ రోజు నా పీఏ ఇంటిపై దాడులు జరిపారు. అక్కడ ఏమీ గుర్తించలేదు. కాబట్టి ఇప్పుడు అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. బీజేపీ వాళ్లకు ఎన్నికల్లో ఓడిపోతామనే భయం’ అంటూ ట్వీట్ చేశారు.
इन्होंने झूठी FIR कर मेरे घर रेड करवाई, बैंक लॉकर तलाश लिए, मेरे गाँव में जाँच कर ली लेकिन मेरे ख़िलाफ़ कहीं कुछ नहीं मिला
आज इन्होंने मेरे PA के घर पर ईडी की रेड करी वहाँ भी कुछ नहीं मिला तो अब उसको गिरफ़्तार कर के ले गये है.भाजपा वालो! चुनाव में हार का इतना डर..
— Manish Sisodia (@msisodia) November 5, 2022