న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను అడ్డుకునేందుకే ఎన్డీయే ప్రభుత్వం ఎన్సీటీ సవరణ బిల్లును తీసుకువచ్చిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు విస్తృతాధికారాలు కట్టబెట్టే ఎన్సీటీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మనీష్ సిసోడియా మోదీ సర్కార్పై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ను చూసి ఎన్డీయే అభద్రతాభావానికి లోనవుతోందని ఆప్ నేత వ్యాఖ్యానించారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ చర్యలతో బీజేపీ అభద్రతా భావానికి లోనవుతోందని ఎన్సీటీ బిల్లు ఆమోదంతో తేలిపోయిందన్నారు.కేజ్రీవాల్ను ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ బిల్లును ప్రయోగించారని ఆరోపించారు. ఢిల్లీలో అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమస్యలు సృష్టించినా వాటిని అధిగమించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆప్ సర్కార్ నెరవేర్చిందని అన్నారు.