న్యూఢిల్లీ, జూన్ 3: అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీరా ఆమెను చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో అప్పటికే దవాఖానకు తరలించడంతో సిసోడియా ఆమెను చూడలేకపోయారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న సిసోడియాను గట్టి భద్రతా ఏర్పాట్లతో మధురా రోడ్లోని ఆయన గృహానికి ఉదయం 9.38 గంటలకు అధికారులు తీసుకువచ్చారు.
అప్పటికే ఆయన భార్య తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఇంట్లోని వారు ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు తరలించారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమను చూడటానికి అనుమతి ఇవ్వాలని సిసోడియా చేసిన విజ్ఞప్తికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా అతను ఫోన్, ఇంటర్నెట్ లాంటివి వాడరాదని, మీడియాతో మాట్లాడరాదని, కుటుంబ సభ్యులతో తప్ప మరెవ్వరినీ కలవరాదని న్యాయస్థానం షరతులు విధించింది.