Punjab CM Bhagwant Mann | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేరుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిసోడియా ఇంటికి భగవంత్ మాన్ చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
అంతకుముందు భగవంత్మాన్ స్పందిస్తూ.. సిసోడియా `నిజం కోసం యుద్ధం` చేస్తున్నారు. యావత్ దేశం ఆయనకు మద్దతుగా ఉంది అని పేర్కొన్నారు. పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు స్పందిస్తూ లక్షల మంది చిన్నారుల మద్దతు మనీశ్కు ఉంటుందని ట్వీట్లు చేశారు.
Delhi| Punjab Chief Minister Bhagwant Mann reaches Deputy Chief Minister Manish Sisodia's residence soon after he was arrested by CBI in connection with liquor policy case. pic.twitter.com/WAt5he8mep
— ANI (@ANI) February 26, 2023
లిక్కర్ స్కామ్ కేసులో ఆదివారం ఎనిమిది గంటల పాటు సిసోడియాను విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. మనీశ్ సిసోడియా అరెస్ట్తో కేంద్రం మురికి రాజకీయాలు చేస్తున్నదని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. మనీశ్ సిసోడియాను తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. సిసోడియా అరెస్ట్కు, ఏ విచారణతో సంబంధం లేదని ఆప్ నేత అతిషి పేర్కొన్నారు.