కోజికోడ్: కేరళలోని కోజికోడ్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ క్యాంపస్(NIT hostel) బిల్డింగ్ లోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని యోగేశ్వర్ నాథ్గా గుర్తించారు. ముంబైకి చెందిన ఆ విద్యార్థి.. ఎన్ఐటీలో మూడవ సంవత్సరం మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
మెన్స్ హాస్టల్ సీ-బ్లాక్లోని ఏడవ ఫ్లోర్ నుంచి యోగేశ్వర్ కిందకు దూకాడు. సోమవారం ఉదయం 6.30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. సూసైడ్ చేసుకోవడానికి ముందు అతను పేరెంట్స్కు మెసేజ్ చేశాడు. అయితే క్యాంపస్ అధికారులకు పేరెంట్స్ ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేశారు. కానీ అప్పటికే యోగేశ్వర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని వెంటనే కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ అతను చనిపోయినట్లు డాక్టర్లు ద్రువీకరించారు. అటాప్సీ నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.