న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య సిసోడియాను ఇంటికి తీసుకెళ్లాలని తీహార్ జైలు సూపరింటెండెంట్ను జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ ఆదేశించారు.
మనీశ్ సిసోడియా, సీఏ బుచ్చిబాబు, అమన్దీప్ సింగ్ ధాల్, అర్జున్ పాండేకు కేసు చార్జ్షీట్, డాక్యుమెంట్ల కాపీలు అందించాలని సీబీఐని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. మే 27న సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకొని సిసోడియాకు సమన్లు జారీ చేసింది.