ఇంఫాల్: మొన్నటి దాకా అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ మెల్లగా కుదుటపడుతున్నది. అయిదు జిల్లాల్లో కర్ఫ్యూ సడలించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెలలో జరిగిన ఘర్షణల్లో 98 మంది మృతి చెందగా, 310 మంది గాయపడినట్టు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటివరకు 4 వేల గృహ దహనం కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
ఆయుధాలు చోరీ చేసిన మూకల సభ్యులను గుర్తించి వారిని నిరాయుధుల్ని చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆర్మీ తెలిపింది. లూటీ అయిన వాటిలో 600 ఆయుధాలు రికవరీ అయినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి.