Manipur | న్యూఢిల్లీ : మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. తమకు జరిగిన అవమానంపై బాధిత మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ విచారణతో పాటు మణిపూర్ హింసాకాండపై కేంద్ర హోం శాఖ ఇటీవల సమర్పించిన నివేదికను కూడా సుప్రీంకోర్టు పరిశీలించనుంది.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ గత వారం సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ కేసు విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం కోర్టును అభ్యర్థించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు.